స్వాగతం!

e-తెలుగు కంప్యూటర్లలో మరియు అంతర్జాలంలో తెలుగును వ్యాపింపజేయాలనే ధ్యేయంతో పనిచేసే లాభాపేక్షలేని సంస్థ. ఇది e-తెలుగు సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైటు.

ఇంగ్లీషు రాని సగటు తెలుగువాడు కూడా తన అవసరాలకి కంప్యూటర్లను (ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను) మరియు అంతర్జాలాన్ని వాడుకోగలగాలి. అదే మా స్వప్నం. ఆ దిశగా మేము కృషిచేస్తున్నాం.
మీ కంప్యూటర్లో తెలుగును స్థాపించుకోడానికి సహాయం కావాలా? చూడండి.
Need help for Telugu in your computer? Click here.
తెలుగులో వ్రాయాలనుకుంటున్నారా? లేఖిని చూడండి.

తెలుగు బాటకి ఆహ్వానం!

తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29)  సందర్భంగా e-తెలుగు తెలుగు బాట అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూంది. తెలుగుకై నడక  ఈ కార్యక్రమ ఉద్దేశం.

వివరాలు:

  •  సమయం: ఆదివారం, ఆగస్టు 29, 2010 - ఉదయం 8 గంటల నుండి 9 వరకు.
  •  స్థలం: హైదరాబాద్, తెలుగు తల్లి విగ్రహం నుండి పీవీ జ్ఞానభూమి వరకు.

సంప్రదించాల్సిన నెంబర్లూ, తదితర  వివరాలని తెలుగు బాట సైటులో చూడవచ్చు.

అచ్చ తెలుగు మాట... పచ్చి తెలుగు మాట... తెలుగునాట ప్రతి నోట పలకాలని; ప్రతిన బూనరా సోదరా... తెలుగుతల్లి రుణం తీర్చుకోరా... నిను కన్ననేల విలువ తెలుసుకోరా... నడవరా తెలుగుబాట... మన జాతికదే వెలుగుబాట...
పై పాటను రాసిన రామ జోగయ్య శాస్త్రి గారి గళం నుండి వినండి

తెలుగు బాట: తెలుగుకై నడుద్దాం!

ఆగస్టు నెల హైదరాబాద్ సమావేశం (8వ తేదీన)

సమయం: ఆదివారం, ఆగస్టు 8, 2010 సాయంత్రం 3 గంటల నుండి 5 వరకు
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)

చర్చాంశాలు:

  • ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మన కార్యక్రమం గురించి చర్చ
  • ఇతరత్రా

సంప్రదింపులు: 99630 29061

తెలుగు రచయితలకు అవగాహనా సదస్సు (ఈ ఆదివారం, హైదరాబాదులో)

తెలుగు రచయితలకు ఆహ్వానం! కంప్యూటర్లలోనూ, జాలం లోనూ తెలుగుని ఉపయోగించడం గురించి తెలుగు రచయితలకి e-తెలుగు ఒక అవగాహనా సదస్సుని నిర్వహిస్తూంది.

సమయం: ఆదివారం, మే 30, 2010 ఉదయం 10 నుంచి మద్యాహ్నం 1 వరకు

పాత్రికేయుల వర్కుషాపు

కంప్యూటరులో, ప్రత్యేకించి అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి కోసం e-తెలుగు సంస్థ కృషి చేస్తోంది. అందుకుగాను అనేక కార్యక్రమాలు చేస్తోంది. ఇటీవల ముగిసిన హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఒక స్టాలు నెలకొల్పి అంతర్జాలంలో తెలుగు గురించిన ప్రచారం కల్పించడమే కాక, కొన్ని తెలుగు సాఫ్టువేర్లను ఉచితంగా అందించింది. ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే వర్కుషాపులను చేపట్టింది. వివిధ అంశాలపై తగు సమాచారం ఇవ్వడమే కాకుండా అనేక సాంకేతిక, సాంకేతికేతర విషయాల్లో తక్షణ సహాయం అందించడం ఈ వర్కుషాపులలో ప్రధాన అంశం. కంప్యూటర్లతో ప్రత్యక్ష డిమాన్‍స్ట్రేషను చెయ్యడం ఈ వర్కుషాపుల్లో ఒక భాగం.

eతెలుగు సభ్యత్వం తీసుకునే సమయంలో మీ సభ్యనామాన్ని(యూజర్ నేమ్) తెలుగులో కూడా పెట్టుకోవచ్చు అన్న విషయం మీకు తెలుసా?

మీ విజయగాథని మాతో పంచుకోండి!

కంప్యూటర్లలోనూ మరియు జాలంలోనూ తెలుగు వచ్చిన తర్వాత మరియు దీని వల్ల మీకు చెప్పుకోదగ్గ విజయం లభించిందా? మీ విజయగాథని మేం వినాలనుకుంటున్నాం. రానున్న హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో పంచే కరపత్రాలలోనూ, సీడీలలోనూ ఈ విజయగాథలను చేర్చాలని మా ఆకాంక్ష. తద్వారా మరింత మందికి ప్రేరణ కల్గించాలనుకుంటున్నాం.

e-తెలుగు స్టాలు నిర్వహణ సంబంధిత విషయాలు

ఈ రోజు నేను, శిరీష్ కుమార్ గారూ హైదరాబాదు పుస్తకప్రదర్శన కమిటీ అద్యక్షులు శ్రీ శ్రీనివాసరావు గారిని మరియు కమిటీ సెక్రటరీ శ్రీ
హనుమంతరావు గారిని కలసి వచ్చే డిసంబరు నెల 17 నుండి 27 వరకు జరగబోయే 24 వ పుస్తక ప్రదర్శనలో గత ఏడాదిలాగే e-తెలుగుకి ఒక ష్టాలుని కేటాయించవలసిందిగా కోరాము. వారు దీనికి సానుకూలంగా స్పందించి అంగీకరించారు.
అలాగే పుస్తక ప్రదర్శన కాలంలో ఏదో ఒక రోజు రెండు గంటలవరకు కాలాన్ని తమ ప్రదర్శనశాలలో ప్రదర్శన నిమిత్తం e-తెలుగుకి కేటాయింటానికి అంగీకరించారు.

కనీసం 10,000 కరపత్రాలు ముద్రించి e-తెలుగు స్టాలు వద్ద పంచటానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.

హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో e-తెలుగు స్టాలు

హైదరాబాదు పుస్తక ప్రదర్శన డిసెంబరు నెల 17 నుండి 27 వరకు నెక్లసు రోడ్డులోని పీపుల్స్ ప్లాజా లో జరుగుతుంది. క్రిందటి సంవత్సరం లాగానే e-తెలుగు ఒక స్టాలును నిర్వహించాలని తలపెట్టింది.

మామూలు రోజుల్లో మద్యాహ్నం 2 నుండి రాత్రి 8 గంటల వరకు మరియు శని, ఆది వారాలలో మద్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు స్టాలు తెరచి ఉంటుంది. స్టాలును విజయవంతంగా నడుపుటకు చాలా మంది వాలంటీర్ల అవసరం ఉంది. తమ సేవలను అందివ్వగల తెలుగు అభిమానులు క్రింది వివరాలను ఇ-మెయిలు ద్వారా గాని టెలిఫోను ద్వారా గాని తెలియపరచమని కోరుతున్నాము.

పేరు:
టెలిఫోను నంబరు:

e-తెలుగు నూతన కార్యవర్గ సభ్యులు

నవంబరు 8 (ఆదివారం) మద్యాహ్నం 2 గంటలకు శ్రీ సి బి రావు గారి ఇంట్లో
సమావేసమైన e-తెలుగు నూతన కార్యవర్గ సభ్యులు క్రింది వారిని పదాధికారులుగా
ఏకగ్రివంగా ఎన్నుకున్నారు.
1) దూర్వాసుల పద్మనాభం - అధ్యక్షులు
2) కత్తి మహేష్ కుమార్ - ఉపాధ్యక్షులు
3) కృపాల్ కశ్యప్ - కార్యదర్శి
4) డి.ఎస్.కె చక్రవర్తి - కోశాధికారి
క్రింది నలుగురు సభ్యులు కార్యవర్గ సభ్యులుగా ఉంటారు.
1) యనమండ్ర సతీష్ కుమార్
2) నామాల నాగమురళీధర్
3) వీరవెంకట చౌదరి ( వీవెన్)
4) సి.బి.రావు
తుమ్మల శిరీష్ కుమార్ గారు, ఉప్పల వెంకట రమణ గారు తమ తమ పదవీ భాధ్యతలను
కొత్త కార్యవర్గానికి అప్పగించారు.

Syndicate content