తెలుగు రచయితలకు ఆహ్వానం! కంప్యూటర్లలోనూ, జాలం లోనూ తెలుగుని ఉపయోగించడం గురించి తెలుగు రచయితలకి e-తెలుగు ఒక అవగాహనా సదస్సుని నిర్వహిస్తూంది.
సమయం: ఆదివారం, మే 30, 2010 ఉదయం 10 నుంచి మద్యాహ్నం 1 వరకు
కంప్యూటరులో, ప్రత్యేకించి అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి కోసం e-తెలుగు సంస్థ కృషి చేస్తోంది. అందుకుగాను అనేక కార్యక్రమాలు చేస్తోంది. ఇటీవల ముగిసిన హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఒక స్టాలు నెలకొల్పి అంతర్జాలంలో తెలుగు గురించిన ప్రచారం కల్పించడమే కాక, కొన్ని తెలుగు సాఫ్టువేర్లను ఉచితంగా అందించింది. ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే వర్కుషాపులను చేపట్టింది. వివిధ అంశాలపై తగు సమాచారం ఇవ్వడమే కాకుండా అనేక సాంకేతిక, సాంకేతికేతర విషయాల్లో తక్షణ సహాయం అందించడం ఈ వర్కుషాపులలో ప్రధాన అంశం. కంప్యూటర్లతో ప్రత్యక్ష డిమాన్స్ట్రేషను చెయ్యడం ఈ వర్కుషాపుల్లో ఒక భాగం.
కంప్యూటర్లలోనూ మరియు జాలంలోనూ తెలుగు వచ్చిన తర్వాత మరియు దీని వల్ల మీకు చెప్పుకోదగ్గ విజయం లభించిందా? మీ విజయగాథని మేం వినాలనుకుంటున్నాం. రానున్న హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో పంచే కరపత్రాలలోనూ, సీడీలలోనూ ఈ విజయగాథలను చేర్చాలని మా ఆకాంక్ష. తద్వారా మరింత మందికి ప్రేరణ కల్గించాలనుకుంటున్నాం.
ఈ రోజు నేను, శిరీష్ కుమార్ గారూ హైదరాబాదు పుస్తకప్రదర్శన కమిటీ అద్యక్షులు శ్రీ శ్రీనివాసరావు గారిని మరియు కమిటీ సెక్రటరీ శ్రీ
హనుమంతరావు గారిని కలసి వచ్చే డిసంబరు నెల 17 నుండి 27 వరకు జరగబోయే 24 వ పుస్తక ప్రదర్శనలో గత ఏడాదిలాగే e-తెలుగుకి ఒక ష్టాలుని కేటాయించవలసిందిగా కోరాము. వారు దీనికి సానుకూలంగా స్పందించి అంగీకరించారు.
అలాగే పుస్తక ప్రదర్శన కాలంలో ఏదో ఒక రోజు రెండు గంటలవరకు కాలాన్ని తమ ప్రదర్శనశాలలో ప్రదర్శన నిమిత్తం e-తెలుగుకి కేటాయింటానికి అంగీకరించారు.
కనీసం 10,000 కరపత్రాలు ముద్రించి e-తెలుగు స్టాలు వద్ద పంచటానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.
హైదరాబాదు పుస్తక ప్రదర్శన డిసెంబరు నెల 17 నుండి 27 వరకు నెక్లసు రోడ్డులోని పీపుల్స్ ప్లాజా లో జరుగుతుంది. క్రిందటి సంవత్సరం లాగానే e-తెలుగు ఒక స్టాలును నిర్వహించాలని తలపెట్టింది.
మామూలు రోజుల్లో మద్యాహ్నం 2 నుండి రాత్రి 8 గంటల వరకు మరియు శని, ఆది వారాలలో మద్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు స్టాలు తెరచి ఉంటుంది. స్టాలును విజయవంతంగా నడుపుటకు చాలా మంది వాలంటీర్ల అవసరం ఉంది. తమ సేవలను అందివ్వగల తెలుగు అభిమానులు క్రింది వివరాలను ఇ-మెయిలు ద్వారా గాని టెలిఫోను ద్వారా గాని తెలియపరచమని కోరుతున్నాము.
పేరు:
టెలిఫోను నంబరు:
నవంబరు 8 (ఆదివారం) మద్యాహ్నం 2 గంటలకు శ్రీ సి బి రావు గారి ఇంట్లో
సమావేసమైన e-తెలుగు నూతన కార్యవర్గ సభ్యులు క్రింది వారిని పదాధికారులుగా
ఏకగ్రివంగా ఎన్నుకున్నారు.
1) దూర్వాసుల పద్మనాభం - అధ్యక్షులు
2) కత్తి మహేష్ కుమార్ - ఉపాధ్యక్షులు
3) కృపాల్ కశ్యప్ - కార్యదర్శి
4) డి.ఎస్.కె చక్రవర్తి - కోశాధికారి
క్రింది నలుగురు సభ్యులు కార్యవర్గ సభ్యులుగా ఉంటారు.
1) యనమండ్ర సతీష్ కుమార్
2) నామాల నాగమురళీధర్
3) వీరవెంకట చౌదరి ( వీవెన్)
4) సి.బి.రావు
తుమ్మల శిరీష్ కుమార్ గారు, ఉప్పల వెంకట రమణ గారు తమ తమ పదవీ భాధ్యతలను
కొత్త కార్యవర్గానికి అప్పగించారు.
2009 అక్టోబరు 25 వ తేదీన మొదటి e-తెలుగు సర్వసభ్య సమావేశం జరిగింది.
హాజరైన వారు:
e-తెలుగు మొదటి సర్వసభ్య సమావేశం 2009 అక్టోబరు 25 న జరపాలని కార్యవర్గం నిర్ణయించింది. ఈ సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు కూడా ప్రతిపాదించబడింది. ఈ ఎన్నికలకు తుమ్మల శిరీష్ కుమార్ ను ఎన్నికల అధికారిగా నిర్ణయించారు. ఎన్నికల విధివిధానాలు ఇల ఉంటాయి.
ఇటీవలి వ్యాఖ్యలు
36 క్షణాలు క్రితం
1 నిమిషం 53 క్షణాలు క్రితం
3 గంటలు 45 నిమిషాలు క్రితం
4 వారాలు 4 రోజులు క్రితం
4 వారాలు 6 రోజులు క్రితం
5 వారాలు 13 గంటలు క్రితం
7 వారాలు 6 రోజులు క్రితం
9 వారాలు 6 రోజులు క్రితం
9 వారాలు 6 రోజులు క్రితం
11 వారాలు 2 రోజులు క్రితం